సౌత్ లో ప్రేమకథా చిత్రాలు, అలాగే థ్రిల్లర్ కాన్సెప్ట్ లతో సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్.ఈ దర్శకుడు సినిమా అంటే అందులో ఎమోషనల్ ఎలిమెంట్, లేదంటే థ్రిల్లర్ ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుందని ప్రేక్షకులు గట్టిగా ఫిక్స్ అయిపోతారు.
ఈ మధ్యకాలంలో దర్శకుడుగా గౌతమ్ మీనన్ పెద్దగా సినిమాలు చేయడం లేదు.తన హిట్ సినిమాలకి సీక్వెల్స్ తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు.
అయితే మరో వైపు నటుడుగా గౌతమ్ మీనన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇప్పటికే మలయాళంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు అక్కడ తన మార్క్ చూపించాడు.
నటుడుగా కూడా తాను పెర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు.అలాగే మాతృభాషలో కూడా నటుడుగా ఇప్పుడు సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.
అది కూడా తన శిష్యుడు కోసం గౌతమ్ మీనన్ తమిళంలో మరోసారి విలన్ గా కనిపించబోతున్నాడు.
తన శిష్యుడు కృష్ణ ఎన్ దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందబోతున్న పతు తల అనే సినిమాలో గౌతమ్ మీనన్ విలన్ గా నటించబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాలో శింబు అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు.శింబు, గౌతమ్ మీనన్ ల మద్య మొదటి నుండి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆ కారణంగానే సినిమా లో విలన్ గా నటించేందుకు సిద్దం అయ్యాడు.అలాగే ఈ సినిమా దర్శకుడు కృష్ణ ఎన్ సుదీర్ఘ కాలంగా తన వద్ద అసిస్టెంట్ గా పని చేశాడు.
అతను చెప్పిన కథ కూడా గౌతమ్ కి నచ్చడంతో పూర్తిస్థాయిలో విలనిజం పండించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞాన్ వేల్ రాజా నిర్మిస్తున్నారు.