టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార, హీరో శింబు ప్రేమలో పడి కొన్ని కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే.శింబు, నయనతార కాంబినేషన్ లో వల్లవన్, ఇతు నమ్మ ఆలు సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.
వల్లవన్ షూటింగ్ సమయంలోనే శింబు, నయనతార ప్రేమలో పడ్డారు.అయితే వీళ్లిద్దరి ప్రేమ గురించి గాసిప్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో విడిపోయిన తరువాత కూడా వారి గురించి అదే స్థాయిలో ప్రచారం జరిగింది.
ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్లు విడిపోయారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.అయితే నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్నారు.మరోవైపు శింబు, ప్రముఖ నటి త్రిషను పెళ్లి చేసుకోబోతున్నాడని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది.అయితే మాజీ ప్రేమికులు నయనతార, శింబులను కలపాలని స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
గతంలో శింబు, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు విన్నైతాండి వరువాయా, అచ్చం ఎన్బదు మడమైయడా హిట్ కావడంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా వేల్స్ సంస్థ బ్యానర్ పై తెరకెక్కనుంది.ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం నయనతారను గౌతమ్ మీనన్ సంప్రదించనున్నారని తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో నటించడానికి నయనతార ఆసక్తి చూపుతారో లేదో తెలియాల్సి ఉంది.
శింబు హీరోగా నటించిన ఈశ్వరన్ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం శింబు మానాడు, ఈశ్వరన్ సినిమాల్లో నటిస్తున్నారు.మరోవైపు నయనతార, విఘ్నేష్ శివన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారం నిజమవుతుందో లేదో తెలియాల్సి ఉంది.
మరోవైపు నయనతార వరుసగా సినిమాలకు కమిటవుతూ బిజీగా ఉన్నారు.