అమెరికాలో భారత సంతతికి చెందిన భార్యా భర్త మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఎంతో అన్యోన్యంగా ఉండే మన్మోహన్మ్, గరిమా ఇద్దరు భార్యా భర్తలు అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న జెర్సీ సిటీలో ఉంటున్నారు.అయితే నిన్నటి రోజున సుమారు 7.15గంటల సమయంలో గరిమ తన ఇంట్లో శవంగా కనపడింది.ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు అయ్యాయి.కాసేపటికే స్థానికంగా ఉన్న హాడ్సన్ నదిలో మన్మోహన్ మృత దేహాన్ని గుర్తించారు పోలీసులు.ఇదిలాఉంటే
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మన్మోహన్ పదేళ్ళ క్రిందటే అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వచ్చాడు.గరిమా కూడా కొన్నేళ్ళ క్రితమే అమెరికా వచ్చి స్థిరపడింది.
ఇద్దరూ పెళ్లి చేసుకుని అమెరికాలో తాము ఉంటున్న ప్రాంతంలోనే నుక్కడ్ అనే పేరుతో హోటల్ పెట్టుకున్నారు.చుట్టుపక్కల ఉండే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
అంతా సవ్యంగా ఉండేదని, ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారని మరి ఇలా ఇద్దరూ చనిపోవడం ఎందుకు జరిగిందో తెలియడంలేదని చుట్టుపక్కల వారు తెలిపారు.
ఇదిలాఉంటే మిస్టరీగా మారిన ఈ కేసుని పోలీసులు హత్య ఆత్మ హత్యగా పేర్కొన్నారు.
అతడే తన భార్యని చంపేసి.అతడు కూడా నదిలో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడని అయితే మరణానికి సంభందించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని.
రిపోర్ట్స్ వచ్చాక విచారణ కొనసాగుతుందని తెలిపారు.ప్రస్తుత పరిస్థితులలో అమెరికా రావడానికి వీలు పడటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంభ సభ్యులు
.