సోషల్ మీడియా ఇపుడు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండటం వలన దేశమంతటా ఏం జరుగుతున్నా ఇట్టే తెలిసిపోతోంది.ఇకపోతే ప్రస్తుతం అంతటా పండగ సీజన్ నడుస్తోంది.
కొద్దిరోజుల క్రితమే వినాయక చవితి ముగియగా.ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి.
దాండియా, గార్బా లాంటి సంప్రదాయ నృత్యాలతో ప్రజలు సంబరాలలో మునిగితేలుతున్నారు.పల్లె, పట్టణం అని తేడా లేకుండా అంతటా కోలాహలం నెలకొంది.
ఇదిలా ఉంటే.నిత్యం రద్దీగా ఉంటే ముంబయి లోకల్ రైల్లో ఓ మహిళల బృందం చేసిన గార్బా నృత్యం ఆకట్టుకుంటోంది.
దాదాపు 15 మంది మహిళలకు పైగా కలిసి ఆడుతుండగా.మిగతా వారు చప్పట్లతో వారిని ప్రోత్సహిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఈ క్లిప్పింగ్ను ఇప్పటికే 195వేల మందికిపైగా వీక్షించగా, అనేకమంది లైక్స్ చేసారు.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.‘వావ్! అద్భుతం!’ అని ఒకరంటే, ‘మన సంప్రదాయాలను ప్రతిబింబించేలాగా వుంది… సూపర్!’ అని మరొకరు, ‘అదొక శుభపరిణామం’ అని ఇంకొకరు….‘దేశ ఖ్యాతిని నలువైపులా వ్యాపింపజేయండి.’ అని మరో యూజర్ కామెంట్ చేసాడు… ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ పెడుతున్నారు…
ఇకపోతే కొద్దిరోజుల క్రితం రాజస్థాన్ ఉదయ్పూర్లో జరిగిన ఓ వేడుక సైతం నెటిజన్లను విశేషంగా మెప్పించిన సంగతి అందరికీ తెలిసినదే.ఇక అది మరువకుండా మరోసారి అలాంటి సంఘటనే జరగడం మంచి శుభ పరిణామం అని నెటిజన్ల ఫీలింగ్.రాజస్థాన్ ఉదయ్పూర్లో స్థానిక నాట్యమండలికి చెందిన బృందం.స్విమింగ్ పూల్లో గార్బా డ్యాన్స్ చేసి ఆహుతులను అలరించింది.సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు గార్బా నృత్యం చేశారు.మండపాలు, గార్డెన్లలో సర్వసాధారమణని.
వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో స్విమ్మింగ్ పూల్లో గార్బా ఆడినట్లు నాట్యమండలి బృందం సభ్యులు తెలిపారు.