ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం జోరందుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో పలువురు నేతలు, ప్రజలు ఈ ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతున్నారు.
ఈ నేపధ్యంలో కొన్ని రోజుల క్రిత్రం తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా తన మద్దతు ప్రకటించారు.దీనిపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి.ఇదిలా ఉండగా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయన్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు.
కాగా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపిన నేపధ్యంలో కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు మాత్రమే ఆయనను కలిసినట్లు గంటా తెలిపారు.
ఈ క్రమంలో కేటీయార్ కూడా తన మంత్రులతో కలిసి ఓ బృందంగా విశాఖకు వస్తామని తెలిపినట్లు గంటా వెల్లడించారు.