వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కృష్ణాజిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఎవరికి అన్నదానిపై రకరకాల డిస్కషన్స్ వైసీపీలో జరుగుతున్న సంగతి తెలిసింది.2019 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.వైసీపీ తరపున పోటీ చేసి అప్పటి టీడీపీ క్యాండెట్ వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు.ఆ తర్వాత వల్లభనేని వంశీ.
వైసీపీ లోకి రావటంతో గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి మొత్తం మారిపోయింది.
ఈ క్రమంలో వల్లబనేని వంశీ.
వైసీపీలోకి వచ్చినా గాని.యార్లగడ్డ వెంకట్రావు.
మద్దతుదారులకి.వంశి అనుచరులు మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి.
అంతమాత్రమే కాదు 2024 ఎన్నికలలో మళ్లీ వైసీపీ టికెట్ తరపున పోటీ చేస్తానని యార్లగడ్డ ప్రకటించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల గన్నవరంలో కృష్ణా జిల్లా పార్టీ ప్లీనరీ సమావేశంలో.మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.2024 ఎన్నికలలో మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ నుండి పోటీ చేసేది సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అని స్పష్టం చేశారు.ఇదే క్రమంలో నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు ఉన్న సీఎం జగన్ పిలిచి మాట్లాడతానని చెప్పినట్లు తెలిపారు.కొడాలి నాని ప్రకటనతో యార్లగడ్డ వెంకట్రావు వర్గం డైలమాలో పడిపోయినట్లు సమాచారం.