రోజుల వ్యవధిలో ఐపీఎల్ మొదలవ్వనున్నడంతో మ్యాచ్ జరిగే పరిసరాలలో భద్రతా చర్యలపై దృష్టి సారించింది.అందులో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మ్యాచ్ లు జరిగే షార్జా, అబుదాబి, దుబాయ్ స్టేడియం లను ఇతర అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
అలాగే కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన వసతులను పర్యవేక్షించిన సౌరవ్ గంగూలీ ఆనందం వ్యక్తం చేశారు.
ఇక సెప్టెంబర్ 19న మొదలు కానున్న ఐపీఎల్ కోసం అన్ని ఫ్రాంఛైజీలు తమ జట్టుతో కలిసి యూఏఈ చేరుకున్నాయి అలాగే ప్రాక్టీసులు కూడా మొదలుపెట్టాయి.
ఇక ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ నెట్ బౌలర్ గా ఎంపికయ్యారు.ఇక ఇన్నాళ్లు కరోనా కారణంగా బ్రేక్ పడిన ఐపీఎల్ త్వరలోనే మొదలవ్వనున్నడంతో సోషల్ మీడియాలో పేజ్ అడ్మిన్స్ అలాగే ఫ్యాన్ వార్ లకు రంగం సిద్ధమైంది.
ఇక ప్రముఖ టీవీ ఛానల్స్ అన్నీ సీనియర్ మోస్ట్ క్రికెట్ ప్లేయర్ లను సంప్రదిస్తూ ఎవరు ఈసారి టైటిల్ గెలుస్తారనే అంశంపై వరుస పెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారు.