రాజకీయాల్లో పదవి, అధికారం ఉన్నంత వరకే విలువ, స్నేహాలు ఒక్క సారి రాజకీయాల నుండి దూరం ఆయితే ఎలాంటి పరిస్దితులు ఎదుర్కోవలసి వస్తుందో ఈ మధ్య కాలంలో పదవిని కోల్పోయిన ఈటల రాజేందర్ను చూస్తే అర్ధం అవుతుందని అంటున్నారు.
ఈయన మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు అన్నా అంటూ మర్యాదగా, తీయ్యగా మాట్లాడిన వారంత ప్రస్తుత పరిస్దితుల్లో చేదుగా మారిపోయారని క్షుణంగా అర్ధం అవుతుంది.
రాజేందర్ను పొగిడిన నోళ్లే ప్రస్తుతం విమర్శిస్తుండటం కుళ్లుపట్టిన రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయట.ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎవరి ఆదేశాలు ఫాలో అవుతున్నారో గానీ మంత్రి గంగుల కమలాకర్ ఊ అంటే ఉస్కో అన్నట్లుగా ఈటలను టార్గెట్ చేస్తున్నారట.
ఈ క్రమంలో ఈటల రాజేందర్ హుజురాబాద్ నాయకులను, ప్రజా ప్రతినిధులను డబ్బులిచ్చి కొంటున్నారు అంటూ విమర్శించడం బాధాకరమని, టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన వారు ఎవ్వరు అమ్మడు పోరని అంటున్న గంగుల నాకంటూ ప్రత్యేకమైన వర్గం ఉండదని అందరు టీఆర్ఎస్ వర్గం వాళ్లేనంటూ చురకలు అంటించారు ఈటలకు.ఇకపోతే కేసీఆర్ బొమ్మతో గెలిచిన తామంతా గులాభి కండువాతోనే ఉంటామని పేర్కొన్నారు.