తెలంగాణలో గ్యాంగ్ స్టార్ నయీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో అరాచకాలు చేసిన గ్యాంగ్ స్టార్ స్టార్ కి పోలీసులు, రాజకీయ ప్రముఖులతో కూడా లింకులు ఉన్నాయి.
అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నయీంని పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు.ఇక ఆ తరువాత అతని అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకి వచ్చింది.
ఇదిలా ఉంటే తాజా గా గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ లెక్క తేలింది.
నయీమ్ ఏకంగా 2 వేల కోట్ల ఆస్తులు అక్రమ మార్గంలో కూడబెట్టాడని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది.1,019 ఎకరాల భూములు, 29 భవనాలు, 2 కేజీల బంగారంతో పాటు, 2 కోట్ల నగదు కూడా ఉందని ఇన్వెస్టిగేషన్ టీం స్పష్టం చేసింది.ఇక నయీం నుంచి స్వాదీనం చేసుకున్న ఆస్తులు కోర్టు అధీనంలో ఉన్నట్లు స్పష్టం చేసింది.