ఈ మధ్య కాలంలో మహిళలపై అరాచకాలు, అత్యాచారాలు, సమాజంలో ఎక్కువైపోయాయి.కర్ణాటక రాయచూరు లో జరిగిన ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే హైదరాబాద్ లో ఇంచుమించు అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఓ మహిళపై ఆమె ప్రియుడు తన స్నేహితులతో కలిపి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన నగర శివార్లలో జరిగింది.వనస్థలిపురం ఏరియాకు దగ్గర్లో ఉన్న కొత్తపేటకు చెందిన 32 ఏళ్ల మహిళ, భర్త నుంచి విడాకులు తీసుకుని, ఒంటరిగా ఉంటోంది.
పెళ్లి నిరాకరించిన మనోజ్ కి ఆమె తరచూ ఫోన్ చేసి, పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది.దీంతో మనోజ్ కుమార్ ఆమెని తన స్నేహితుల ఇంటికి పిలిచి స్నేహితులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆమె అరుపులతో అనుమానం వచ్చిన స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.సంఘటనా స్థలంలో మహిళ పరిస్థితిని చూసి షాకైన పోలీసులు, ఆమెను ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు మనోజ్ కుమార్తో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
.