హైదరాబాదులోని పాతబస్తీ ప్రాంతంలో ముక్కు పచ్చలారని 11 సంవత్సరాలు కలిగి ఉన్న ఒక మైనర్ బాలికపై ముగ్గురు కామాంధులు పాశవికంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణంలోని పాతబస్తీ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కూతురితో పాటూ నివసిస్తున్నాడు.
ఇతడు చిన్నచిన్న పెయింట్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.అయితే ఈ క్రమంలో అతడు ఒక రోజున అలీ నగర్లోని ఓ రంగుల పరిశ్రమలో పని నిమిత్తమై వెళ్లి తన వెంట తన కూతురిని కూడా తీసుకెళ్లాడు.
అయితే అతడు తన పనిలో నిమగ్నమై ఉండటంతో బాలిక ఒంటరిగా ఆడుకుంటోంది.అక్కడే ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఇది గమనించి బాలికని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఒకరు తరువాత ఒకరు పైశాచికంగా అతేకారం చేశారు.
అంతేగాక ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు.
అయితే బాలికకి రక్తస్రావం అవుతుండటం గమనించిన బాలిక తండ్రి ఏమైందని అడగగా తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది.దీంతో బాలిక తండ్రి వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.