దేశంలో ఎన్నో గణపతి దేవాలయాలు ఉన్నా.దట్టమైన అడవులు, కొండలు, కోనలు మధ్య ఓ పెద్ద కొండపై వినాయకుడు ఉంటే.ప్రకృతి ప్రేమికులకు పండగే.1100 ఏళ్ల చరిత్ర కలిగిన నాగవంశీయుల కాలంలో అడవి లోపల 14 కి.మీ దూరంలో కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతం మొత్తం దట్టమైన అడవులతో దర్శనమిస్తుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ పరిధిలో ఈ అటవీ ప్రాంత విస్తరించి ఉంటుంది.ఈ ప్రాంతంలో మావోయిస్టులు అధికంగా ఉంటారు.ఈ దట్టమైన అర్యణంలోని ఓ కొండ మీద ప్రాచీన కాలం నాటి విగ్రహం ఉంది.వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ వినాయకుడు ఈ దట్టమైన ప్రాంతంలో ఉండటంతో అసలు అలాంటి విగ్రహం ఉందని ప్రపంచానికి తెలియదు.2102లో స్థానిక జర్నలిస్ట్ ఈ దోల్ కల్ కొండ గుర్తించాడు.కొండపైన ఆరు అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహం కనిపించింది.13 వేల అడుగుల ఎత్తున్న ఈ కొండ ప్రాంతానికి చేరుకోవడం అంత తేలిక కాదు.ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ముందుగా దంతెవాడ గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి 20 కి.మీ.దూరంలో ఉన్న మిడ్ కుల్నర్ గ్రామానికి వెళ్లి అక్కడి నుంచి అడవిలో 7 కిలో మీటర్లు నడవాలి.కొండలు, గుట్టలు నడుస్తూ వెళ్తుంటే తప్ప వినాయకుడు ఉన్న ప్రదేశాన్ని చేరుకోలేమని ఆ జర్నలిస్ట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.