తెలుగు ప్రేక్షకులకు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన ఎప్పుడూ ఎవరి మీద ఎలా విరుచుకు పడతాడో, లేకపోతే ఆకాశానికి ఎత్తుతాడో అర్థం కాని పరిస్థితి.
అయితే ఈ మధ్య కాలంలో ఆయన చేసే మాటలలో కాస్త పెద్దరికం కనపడుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఓ కమెడియన్ గా వచ్చి అనతికాలంలోనే ఎవరూ ఊహించని విధంగా బడా నిర్మాతగా మారిపోయాడు బండ్ల గణేష్.
పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలను నిర్మించి భారీ హిట్ లను కూడా సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ రాజకీయాల్లోకి బండ్ల గణేష్ అడుగుపెట్టాడు.
కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు.అయితే చివరికి రాజకీయ పరిణామాల దృష్ట్యా అతనికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ చేయలేదు.
చివరికి 2019లో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్న తర్వాత అతను మళ్లీ సినిమాల్లో నటించాడు.ఇక తాజాగా ఆయన కరోనా నుండి కోలుకున్నాడు కూడా.
ఇలా కరోనా నుండి కోలుకున్న తర్వాత ఆయన ప్రవర్తనలో కొద్ది మార్పులు కనపడుతున్నాయి.ఇకపై తాను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడాలని అనేకసార్లు చెబుతూ వస్తున్నాడు.
ఇకపోతే ఇటీవల పవన్ కళ్యాణ్ తో సినిమా ఫిక్స్ అయినట్లుగా ట్విట్టర్ ఖాతా ద్వారా ” నా బాస్ ఓకే చెప్పారు.నా కలలు మరోసారి నిజమయ్యాయి.
నా దేవుడు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు” అంటూ తెలిపాడు.అయితే ఈ విషయం పై మెగా అభిమానులు కూడా బండ్ల గణేష్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు కూడా తెలుపుతూ మంచి డైరెక్టర్ ని సెట్ చేసి సినిమా హిట్ చేయాలని సలహాలు ఇచ్చారు.
ఇదంతా బాగానే ఉన్న తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇకపోతే అందులో తన పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఆయన స్పందిస్తూ ” వీపుమీద కొట్టండి.
కానీ, దయచేసి కడుపు కొట్టొద్దు.ఇది నా విన్నపం అంటూనే.
నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన ” అంటూ తెలిపాడు.ఇలా ట్వీట్ చేయడం వెనకాల ఎలాంటి విషయం దాగుందో చూడాలి మరి.