అమరావతి రైతులు పిలుపునిచ్చిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ పాల్గొన్న విషయం తెల్సిందే.ఆ సందర్బంగా పోలీసులపై దౌర్జన్యం చేశాడు అంటూ గల్లా జయదేవ్పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరిగింది.
నిన్న ఉదయం అరెస్ట్ అయిన గల్లా జయదేవ్ నేడు తెల్లవారు జామున సబ్ జైలుకు తరలించారు.జైల్లోనే ఆయన రెండు మూడు రోజులు ఉండాల్సి రావచ్చు అనుకున్నారు.
అయితే నేడు ఆయనకు బెయిల్ వచ్చింది.
నేడు మద్యాహ్నం వరకు గల్లా జయదేవ్ బయటకు వచ్చాడు.
గల్లా తరపు న్యాయవాది మగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పత్రాలు సమర్పించడంతో పాటు షురుటీగా కూడా కొందరిని ఉంచడంతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది.గల్లా జయదేవ్ కండీషన్స్తో కూడిన బెయిల్ను పొందాడు.
గల్లా అరెస్ట్పై గుంటూరు జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.జైలు వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు చేరుకున్నారు.