వరుణ్ తేజ్, హరీష్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంకు పాజిటివ్ టాక్ వచ్చింది.మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్ర బయ్యర్లకు లాభాలు మొదలయ్యాయి.
సినిమాను దాదాపు 25 కోట్లతో పూర్తి చేశారు.అన్ని ఏరియాలు మరియు ఇతర రైట్స్ ద్వారా దాదాపుగా 37 కోట్ల రూపాయలు వచ్చాయి.
కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారా 24 కోట్ల రూపాయలు నిర్మాతల ఖాతాలో పడ్డట్లుగా సమాచారం అందుతోంది.బయ్యర్లు ఈ చిత్రంను 24 కోట్లకు కొనుగోలు చేయగా ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బయ్యర్లు లాభాలను దక్కించుకుంటున్నారు.
నైజాం ఏరియాలో మొదటి అయిదు రోజుల్లో సినిమా 6 కోట్ల మేరకు వసూళ్లు సాధించింది.నైజాం ఏరియాలో సినిమా 10 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నైజాం ఏరియాతో పాటు మరో రెండు మూడు ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ సాధ్యం అయ్యింది.అయిదు రోజుల్లో దాదాపుగా 20 కోట్ల రూపాయలను వసూళ్లు చేసిన ఈ చిత్రం వారాం రోజుల్లో మరో రెండు కోట్లతో 22 కోట్లతో నిలిచే అవకాశం ఉంది.
ఇక సెకండ్ వీకెండ్స్లో అయిదు కోట్ల వరకు వసూళ్లు రాబట్టినా కూడా 27 కోట్ల వరకు సినిమా కలెక్షన్స్ రానున్నాయి.
లాంగ్ రన్లో సినిమా 30 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గద్దలకొండ గణేష్ చిత్రం సైరా చిత్రం వచ్చే వరకు దుమ్ము దులుపుకుంటూ దూసుకు పోవడం ఖాయం.30 కోట్ల షేర్ను రాబట్టడం అంటూ సూపర్ హిట్గా చెప్పుకోవచ్చు.వరుణ్ తేజ్కు ఫిదా తర్వాత ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్గా నిలిచే అవకాశం ఉంది.