క్రికెట్ కు భారత్ లో ఎంత ఆదరణ ఉందో మనకు తెలిసిందే.క్రికెట్ ను ఒక ఆటలాగా కాక ఒక మతంలా భావిస్తారు.
మిగతా ఆటల కంటే క్రికెట్ పైనే ఎక్కువ ఫోకస్ పెడతారు.దాని ద్వారా లాభలెన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి.
అయితే ప్రస్తుతం భారత క్రికెట్ లో యువ రక్తం ఉరక లెత్తుతోంది.అంతగా అనుభవం లేని యువ క్రికెటర్లు సైతం కఠిన పరిస్థితులలో ఆడుతూ భారత్ ను గెలిపిస్తున్న తీరు అద్భుతమని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇప్పటికే రిషబ్ పంత్ అన్ని ఫార్మాట్ లలో సత్తా చాటుతున్నాడు.ఒకప్పుడు ఫామ్ లోపంతో సతమతమైన పంత్ ధోనీ ట్యాగ్ ను తొలగించుకోవడానికి చాలా సాధన చేసాడనే చెప్పవచ్చు.
అయితే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా రిషబ్ పంత్ నియమితుడైన విషయం తెలిసిందే.ఈ సందర్బంగా రిషబ్ కు సీనియర్ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే రిషబ్ పంత్ కు కెప్టెన్సీ ఇవ్వడంపై స్పందించిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ రిషబ్ కు కెప్టెన్సీ ఇవ్వడం మంచి నిర్ణయమని, ఆటాకింగ్ షాట్లు ఆడుతూ అన్ని ఫార్మాట్ లలో సత్తా చాటుతున్న రిషబ్ పంత్ భవిష్యత్తులో ఇండియా కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర లేదని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు.