కాలం మారింది.కాలంతో పాటే మనం జరుపుకునే వేడుకల్లో కూడా అనేక మార్పులు వస్తున్నాయి.
ఒకప్పటి కంటే కూడా చాలా సరదాగా ట్రెండీగా వేడుకలు జరుగుతున్నాయి.ఇక మరీ ముఖ్యంగా ప్రతి వ్యక్తి విషయంలో అత్యంత కీలకమైన పెండ్లి వేడుక కూడా చాలా డిఫరెంట్ గా జరుపుకుంటున్నారు చాలామంది.
పెండ్లిలో ఒకప్పుడు పెండ్లి కూతురు సిగ్గుతో తల వంచుకుని పెండ్లి జరిపించుకునేది.కానీ ఇప్పుడు మాత్రం చాలా మారిపోయారు.
పెండ్లిలో డ్యాన్సులు, ఫొటో షూట్లు, సరదాగా గేమ్ లు ఆడుకోవడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి.
ఇక ఈ మధ్య సరదాగా గేమ్ లు ఆడుకోవడం చాలా వరకు చూస్తున్నాం.
గేమ్ లు పెట్టి వారిలో ఎవరు గెలిస్తే ఓడిపోయిన వారికి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం.ఇప్పుడు కూడా ఓ పెండ్లి వేడుకలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.చూసేందుకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది.
వైరల్ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.పెండ్లి వేడుకలో వధూవరులతో ఏదైనా ఆట ఆడించాలంటూ ఓ ప్రతిపాదన వస్తుంది.
ఇందుకు పంతులును బంధువులు ఒప్పించారు.ఇంకేముంది పంతులు గారు అన్ని సిద్ధం చేయించారు.ఇక స్టేజి కింద కుర్చీని పెట్టించారు.అంటే కుర్చీలాట ఆడాలన్నమాట.పంతులు స్టార్ట్ అన్నప్పుడు ఆ కుర్చీల చుట్టూ తిరగాలి.పంతులు చేయి దించగానే కుర్చీలో కూర్చోవాలి.
నిలబడ్డ వారు ఓడిపోయినట్టు.కాగా ఇక్కడ గెలిస్తేనే ఇంట్లో మన పంతం నెగ్గుతుంది అన్నట్టు వధూవరులు ఇద్దరూ కూడా పోటాపోటీగా గేమ్ ఆడటం మనం ఇందులో చూడొచ్చు.
అయితే చివరకు వధువు ఇందులో గెలుస్తుంది.అంటే ఎప్పటికీ భార్యదే పెత్తనం మరోసారి రుజువు అయిందన్నమాట.