కరోనా వైరస్ మనుషుల మధ్య దూరం మరింత పెంచేస్తుందా.మానవత్వం నశించిపోతుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది.
కరోనాతో చనిపోతున్న వారిని ఖననం చేయడానికి కనీసం బంధువులు కూడా ముందుకి రావడం లేదు.తాజాగా చెన్నైలో కరోనా రోగులకి చికిత్స అందిస్తూ ఓ డాక్టర్ కరోనా బారిన పడి మృతి చెందాడు.
అయితే అతను మృతి చెందిన తర్వాత అత్యంత దారుణ స్థితిలో అర్ధరాత్రి తోటి డాక్టర్ అంబులెన్స్ లో తీసుకెళ్ళి, ఖననం చేశారు.అది కూడా సీల్డ్ కవర్ చుట్టి ఖననం చేసేసారు.
దీనిపై అతని భార్య ముఖ్యమంత్రి పళనిస్వామికి వీడియో ద్వారా విజ్ఞప్తి చేసింది.తన భర్త అంత్యక్రియలను సంప్రదాయ బద్దంగా జరిపించాలని ముఖ్యమంత్రి పళనిస్వామికి చనిపోయిన డాక్టర్ సైమన్ హెర్క్యులెస్ భార్య ఆనంది సైమన్ విజ్ఞప్తి చేశారు.
హెర్క్యులెస్ చివరి కోరిక ప్రకారం ఆయన మృతదేహాన్ని చెన్నైలోని కీల్ పాక్ శ్మశానవాటికలో ఖననం చేయాలని కోరారు.కరోనాతో నా భర్త చనిపోయారు.
ఒకవేళ ఈ మహమ్మారి వల్ల తాను చనిపోతే మా సంప్రదాయాల ప్రకారం ఖననం చేయాలని నా భర్త చివరి కోరిక కోరారు.కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి సమర్థవంతంగా పని చేస్తున్నారు.
నా భర్త చివరి కోరికను కూడా నెరవేర్చండి అని కోరుతూ వీడియోలో ఆనంది కంటతడి పెట్టారు.నా భర్త మృతదేహాన్ని సీల్డ్ కవర్ చుట్టి పూడ్చారు.
ఆయన మృతదేహాన్ని అలాగే బయటకు తీసి మా మత విశ్వాసాల మేరకు అంత్యక్రియలను నిర్వహించేందుకు అనుమతించండి.డెడ్ బాడీ వల్ల వైరస్ వ్యాప్తి చెందదు.
ఇద్దరు పిల్లలను కలిగి ఉన్న వితంతువును నేను.నా భర్త ఆఖరి కోరిక తీర్చండి’ అని ఆనంది కోరారు అని కోరింది.
దీనిపై పళని స్వామి ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి
.