ఈ ఏడాది జరిగిన మిస్ ఇండియా పొటీల్లో తెలంగాణకు చెందిన వాసవి మొదటి స్థానంలో నిలిచి ‘మిస్ ఇండియా టైటిల్’ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడీ తెలుగు అమ్మాయి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
ముంబాయి హయ్యత్ రిజెన్సీలో బుధవారం జరిగిన విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా 2020 వేడుకలో తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మొదటి స్థానంలో నిలిచి అందాల కిరీటం గెలుచుకుంది.
ఇక సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే మానస తన ప్రాక్టీస్ను నిత్యం కొనసాగిస్తూ, ఆ అనుభవాలను పంచుకుంటూనే ఉంటుంది.
‘సాధన చేస్తూ ఉంటే జీవితం ఏం ఇస్తుందో ఎవరూ చెప్పరు.రాయడం, చిత్రలేఖనం, పరిగెత్తడం, పాడటం వంటివి మాత్రమే కాదు స్నేహితులను ఎలా సంపాదించుకోవాలో కూడా సాధన చేయాలని ఆమె చెప్పారు.
ఇక మంచి ఫ్రెండ్గా, మంచి తోబుట్టువుగా, మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా సాధన చేయాలి.ప్రజలు దానిని గుర్తించేంత వరకు సాధన ఆపకూడదు.
అవసరమైన చోట కోపం చూపడం, అవసరమైన వారికి దయను ఎలా అందించాలో కూడా నేర్చుకోవాలి.ఇవన్నీ మనల్ని శక్తింతులను చేసేవే, ఇవే మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని నేను గ్రహించాను’ అని చెప్పారామె.
అయితే కాస్త పెద్దయ్యాక ప్రతిరోజూ నన్ను నేను ప్రశ్నించుకుంటూ, మెరుగుపరుచుకోవడం మొదలయ్యింది.ఇప్పటికీ ఈ అలవాటును కొనసాగిస్తూనే ఉన్నాను.దీనివల్ల ప్రతియేటా నన్ను మరింత శక్తిమంతురాలిగా ఈ లోకం ముందు నిలబెడుతుంది’ అంటూ తన ఆలోచనలు పంచుకుంటారు ఆమె.ఈ అందాల రాశి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి, పిల్లలకు విద్యాబోధన కూడా చేసింది.ఇక పిల్లలతో ఉండడం వల్ల, వారి చిరునవ్వుల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఎంతో సంతోషాన్ని పంచుకోవచ్చని అంటుంది మానస.కళలపై ఉన్న అభిరుచి, సాధన ఈ రోజు ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టాయి.
అయితే మొదట్లో తాను మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటానని చెబితే మా కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, మిస్ ఇండియా టైటిల్ గెలుపొందాక చాలా సంతోషించారని తెలిపారు.తాను మిస్ ఇండియా కావడానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు.
భవిష్యత్తులో మీ ప్రణాళిక ఎంటనీ మీడియా వారు అడిగిన ప్రశ్నలకు.మిస్ వరల్డ్ కావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
అంతేకాకుండా మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో నటించేందుకు ఆలోచిస్తానని వెల్లడించారు.