టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో పాటు అక్కినేని హీరోలను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.అయితే అక్కినేని కుటుంబానికి చెందిన వ్యక్తులకే ఎందుకు ఈ విధంగా జరుగుతుందో అని చైసామ్ విడాకుల నేపథ్యంలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
అక్కినేని కుటుంబానికి చెందిన వ్యక్తుల లైఫ్ పార్ట్ నర్ కు సంబంధించి ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఏఎన్నార్ కుటుంబానికి చెందిన వాళ్లలో ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నారు.
స్టార్ హీరో నాగార్జున మొదట వెంకటేష్ సోదరి లక్ష్మీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే కొన్ని కారణాల వల్ల నాగార్జున, లక్ష్మీ విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత నాగార్జున అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత నాగార్జున, అమల అన్యోన్యంగా ఉన్నారు.
హీరో సుమంత్ హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే కీర్తి రెడ్డి, సుమంత్ మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుప్రియ హీరో చరణ్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.చరణ్ రెడ్డి అనారోగ్య సమస్యల వల్ల చనిపోగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని తెలుస్తోంది.హీరో అఖిల్ కు శ్రియా భూపాల్ తో నిశ్చితార్థం జరగగా కొన్ని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది.తాజాగా నాగచైతన్య సమంత కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం.
అక్కినేని కుటుంబానికి ఏదో శాపం తగిలిందని ఆ శాపం వల్లే ఈ విధంగా జరుగుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.నాగార్జున ఏవైనా దోషాలు ఉంటే పరిహారాలు చేయించాలని లేదంటే శాపాలు భవిష్యత్తు తరాలను కూడా వెంటాడతాయని నెటిజన్లు చెబుతున్నారు.అక్కినేని నాగేశ్వరరావు నాస్తికుడు కాగా నాగార్జున మాత్రం నాస్తికుడు కాదు.అక్కినేని ఫ్యామిలీకి చెందిన వ్యక్తుల విషయంలో ఈ విధంగా జరగడంతో అక్కినేని అభిమానులు సైతం హర్ట్ అవుతున్నారు.