ప్రమాదాలనేవి ఒక్కొక్కసారి ఎవరూ ఊహించని విధంగా జరిగిపోతుంటాయి.మన చుట్టూ ఉండే వస్తువులే మన ప్రాణాలను హరించి వేస్తాయి.
తాజాగా హైదరాబాద్ శివారులోని బొంగులూరులో ఓ విషాదం చోటు చేసుకుంది.ఇంట్లోని ఫ్రిజ్ పేలి 18 ఏళ్ల యువతి చనిపోయింది.
భారీగా మంటలు చెలరేగడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.పూర్తి వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే… నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కొప్పుల మనోహర్ లావణ్య దంపతులు ఐదేళ్లుగా బొంగులూరులో నివాసం ఉంటున్నారు.
వీరి కుమార్తె దీపిక(19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది.సెమిస్టర్ పరీక్షల కారణంగా ఆమె ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది.
అయితే గురువారం ఉదయం తల్లిదండ్రులు తమ తమ ఉద్యోగాలకు… సోదరి స్కూల్కు వెళ్లడంతో.ఇంట్లో గడియపెట్టుకుంది.మధ్యాహ్నం సమయంలో దాహం వేడయంతో నీళ్లు తాగేందుకు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేయడంతో.వెంటనే కంప్రెషర్ పేలిపోయి మంటలు చెలరేగాయి.దీపికకు మంటలు అంటుకోవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.ఇళ్లు మొత్తం మంటలు అంటుకుని వస్తువులన్నీ కాలిపోయాయి.
ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది.పెద్దఎత్తున శబ్దం, మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను అదుపు చేశారు.