“వినాశకాలే విపరీత బుద్ధి” అన్నారు పెద్దలు.లేకపోతే మరేంటి.
మహిళల మూత్రంతో బ్రెడ్స్ తయారు చేయడమా…? ఎవరన్నా వింటే నవ్వి పోరు.అని అనుకుంటున్నారు కదూ.కానీ ఇది నిజం.మాములుగా మనం గోమూత్రం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని నమ్ముతాం.
అలాగే మహిళల మూత్రంతో కూడా ఎన్నో.మరెన్నో లాభాలు ఉన్నాయని చెబుతోంది ఓ మహిళ.అంతటితో ఆగకుండా… ఆమె ఏకంగా మహిళల మూత్రంతో బ్రెడ్స్ కూడా తయారు చేస్తోంది.అవును…
బ్రెడ్లో పోషక విలువలు పెంచేందుకు మహిళల మూత్రాన్ని వాటిపై జల్లుతోంది.‘లూయిస్ రాగెట్’ అనే ఇకో ఫెమినిస్ట్.అలాగే వాటికి ‘గోల్డీ లాక్స్ బ్రెడ్’ అని నామకరణం చేసి, వాటి బ్రాండ్ విలువ పెంచడానికి తెగ కష్టపడుతోంది.
ఇకపోతే.ఈ బ్రెడ్ తయారీ కోసం ఆమె రోజూ మహిళల మూత్రాన్ని డబ్బులిచ్చి మరీ సేకరిస్తున్నట్టు చెబుతోంది.
అలా సేకరించిన మూత్రాన్ని శుద్ధి చేసి బ్రెడ్ మీద స్ప్రే చేస్తానంటోంది.మనుషుల శరీరంలోంచి బయటకు వచ్చే వ్యర్థం వలన ఏమి లాభం అనే ప్రశ్న మీకు తలెత్తుతోంది కదూ.అయితే దాని వెనుక అనేక లాభాలు ఉన్నాయని అంటోంది మిస్ ఫెమినిస్ట్.అవును.ఆమె దానికి సమాధానంగా.“ఫ్రెంచ్ అర్బన్ ప్లానింగ్ ఏజెన్సీ రీసెర్చ్ ప్రకారం.మూత్రం పొటాషియం, నైట్రోజన్ తదితర ఎన్నో రకాల విలువైన పోషకాలను కలిగి ఉంటుంది.వీటి కోసం మన పరిశ్రమలు ఎంతో కష్టపడి భూమి నుంచి వాటిని వెలికి తీస్తున్నాయి.” అని పేర్కొంది.అలాగే.
29 మిలియన్ల యూరిన్ బ్రెడ్లు తయారు చేయడం వల్ల ప్రతి రోజూ పరిశ్రమల్లో 703 టన్నుల నైట్రోజన్ను మనం ఆదా చేయొచ్చు అని సలహా ఇస్తోంది.