చెన్నై లో వ్యాపారి వినూత్న నిర్ణయం కేజీ పిండి కొంటే నీరు ఉచితం

గత కొద్దీ రోజులుగా చెన్నై లో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందొ అన్న విషయం తెలిసిందే.సామాన్యుల నుంచి సెలబ్రిటీ ల వరకు ప్రతి ఒక్కరు కూడా బిందెడు నీటి కోసం నానా తిప్పలు పడుతున్నారు.

 Free Water With One Kg Dosa Batter-TeluguStop.com

ఈ నీరు లేక చివరికి ఐటి కంపెనీలకు కూడా సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రస్తుతం అక్కడ బిందె నీటిని రూ.5 నుంచి విక్రయిస్తున్నారు కూడా.అయితే అలాంటి నీటి ఎద్దడి ఉన్న చైన్నై లో ఒక చిరు వ్యాపారి వినూత్న నిర్ణయం తీసుకున్నాడు.

తన షాప్ లో కేజీ దోశ పిండి కొనుక్కున్న వారికి బిందె నీళ్లు ఉచితంగా ఇస్తాను అని ప్రకటించడం తో అక్కడకి జనం తెగ ఎగబడుతున్నారు.నగరంలో ఏర్పడిన నీటి ఎద్దడి ని వినియోగించుకొని తన బిజినెస్ ను పెంచుకోవాలని ఆ వ్యాపారి ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు.

ఏదైతే ఏంటి ఒకపక్క తన వ్యాపారం ని అభివృద్ధి చేసుకున్నాడు అలానే నీళ్ల కోసం నానా తంటాలు పడుతున్న జనాలకు నీళ్లు ఉచితంగా ఇచ్చి సాయం అందిస్తున్నాడు.మొత్తానికి చెన్నై లో ఏర్పడిన నీటి సమస్య కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా జనాలు ఆ వ్యాపారి షాప్ ముందు క్యూలు కడుతున్నారట.

చెన్నై లో వ్యాపారి వినూత్న ని�

ఇటీవల చైన్నై లో నీటి ఎద్దడి చోటుచేసుకుంది.ఏకంగా చెన్నై పరిస్థితి పై హాలీవుడ్ హీరో కూడా ట్వీట్ చేసే స్థాయికి ఈ నీటి ఎద్దడి అనేది పెరిగిపోయింది.నగరంలో ఉన్న బావులు,చెరువులు అన్ని కూడా ఎండుకుపోవడం తో అక్కడ ప్రాణాలు నానా కష్టాలు పడుతున్నారు.ఇటీవల ప్రముఖ గాయకుడూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తాను స్నానం చేసేందుకు అర బక్కెట్‌ నీటి కోసం వేచి చూడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇలా ప్రతి ఒక్కరూ కూడా నీటి ఎద్దడి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube