ఉపాసన కామినేని కొణిదెల మంచితనానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి.ఈమె మెగా కోడలుగా ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే అపోలో హాస్పిటల్ వ్యవహారాలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.
ఇలా అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటూనే మారుమూల గ్రామాల ప్రజలకు వైద్య సేవలను అందించడమే కాకుండా,ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉపాసన తన మంచితనాన్ని బయట పెడుతున్నారు.ఇక కేవలం పేద ప్రజల కోసమే కాకుండా వన్యప్రాణుల కోసం మూగజీవాల కోసం ఉపాసన ఎంతో శ్రమిస్తున్నారు.
ఇప్పటికే ఎన్నో రకాల మూగజీవాలకు ఈమె సహాయసహకారాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఉపాసన దేశవ్యాప్తంగా ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి తమ హాస్పిటల్ లో ఎక్కడైనా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని ఉపాసన ప్రామిస్ చేశారు.
ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న డబ్ల్యూ డబ్ల్యూఎఫ్ తో కలిసి ఫారెస్ట్ అధికారులు ఇతర ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు అందించడానికి తాను అంగీకరిస్తున్నట్లు ఉపాసన ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా వన్యప్రాణుల వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురైన లేదా దాడులకు గురైన వారు అపోలో హాస్పిటల్ లో ఉచిత వైద్య సేవలను పొందవచ్చని ఉపాసన ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజనులు మరోసారి ఉపాసన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఉపాసన తనలో ఉన్న మానవతా దృక్పథాన్ని మరోసారి బయట పెడుతూ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.