తిరుమల భక్తులకు శుభవార్త.. ఇకపై ఫ్రీ!

తిరుమల వెంకటేశుడిని దర్శించుకుంటే తమ బాధలు తొలుగుతాయని నమ్మే భక్తులు, రోజుకు లక్షల్లో స్వామివారిని దర్శించుకుంటారు.అలాంటి తిరుమలేడి ప్రసాదం కోసం భక్తులు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

 Free Tirumala Laddu For Balaji Devotees-TeluguStop.com

తిరుమలకు ఎంతటి పేరుందో అక్కడ ప్రసాదంగా ఇచ్చే లడ్డూకు కూడా ప్రపంచవ్యాప్తంగా అంతే గుర్తింపు ఉంది.అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల కోసం ఉచిత లడ్డూలను అందించే కార్యం ముందేసుకున్నారు.

ఇప్పటి వరకు కేవలం నడకదారిన వెళ్లే భక్తులకు మాత్రమే ఉచిత లడ్డూలను అందించేవారు.కాగా కొత్త సంవత్సరం కానుకగా ఈ నిర్ణయాన్ని తీసుకుందట టీటీడీ.

ఇకపై తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూను అందించాలని టీటీడీ నిర్ణయించింది.వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

ప్రస్తుతం ఒక్కోక్కరికి రెండు లడ్డూలను కౌంటర్ ద్వారా అందించే టీటీడీ, ఇకపై ఎన్ని లడ్డూలైనా కొనుగోలు చేసే అవకాశం కల్పించనుంది.

టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంతో తిరుమల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి లడ్డూని ప్రతి ఒక్కరికి అందించేందుకు తితిదే నిర్ణయం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube