మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగం అయిపోయింది.ఇంటర్నెట్ సహాయంతో స్మార్ట్ ఫోన్ వినియోగం ద్వారా అరచేతిలోనే చాలా పనులు అయిపోతున్నాయి.
చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ల వరకు అందరూ స్మార్ట్ ఫోన్( Smart phone ) కి బాగా అలవాటు పడిపోయారు.చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కూడా ఫోన్ కి బాగా అలవాటు పడిపోయారు.
మహిళలు సైతం స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడటం జరిగింది.ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ తెలియజేసింది.
విషయంలోకి వెళ్తే రక్షాబంధన్ పండుగకు 40 లక్షల మంది మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్( CM Ashok Gehlot ) ప్రకటించారు.స్మార్ట్ ఫోన్ తో పాటు మూడు సంవత్సరాలు సరిపడా ఇంటర్నెట్ ప్యాక్ కూడా అందించనున్నట్లు తెలిపారు.
సీఎం డిజిటల్ సేవా యోజన ద్వారా ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు ఈ స్మార్ట్ ఫోన్ లు ఇవ్వబోతున్నట్లు అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు.అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ₹25 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పుకొచ్చారు.
సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటనతో రాజస్థాన్ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.