కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఈ వైరస్తో యుద్ధం చేస్తున్న భారత్కు పలు దేశాలు బాసటగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలో ఇది వరకే తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న మిగతా దేశాల బాటలో ఫ్రాన్స్ కూడా చేరింది.
ఈ క్రమంలో ఇరు దేశాలు కలిసి కొవిడ్-19పై పోరాడదామని పిలుపునిచ్చింది.
ఇకపోతే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇండియాలో తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఇక్కడి ప్రజలు, కరోనా పేషెంట్లు కఠినమైన పరిస్దితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో పగలు, ప్రతికారాలు అంటూ ఇన్నాళ్లూ స్వార్ధంతో ప్రవర్తించిన చైనా, పాకిస్దాన్ కూడా భారత్కు అండగా నిలిచేందుకు ముందుకు రావడం శుభపరిణామమే.
ఇదిలా ఉండగా పలు ఫ్రెంచి కంపెనీలు కూడా సాయం అందించడానికి ముందుకు వస్తున్నాయి.
అంతే కాకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రన్ ఫేస్బుక్ వేదికగా భారత్కు హై కెపాసిటీ ఆక్సిజన్ జనరేటర్లు, 2 వేల మంది పేషెంట్లకు ఐదు రోజులకు సరిపోయే లిక్విడ్ ఆక్సిజన్, వెంటిలేటర్లను ఇతర వైద్య పరికరాలను త్వరలోనే పంపిస్తామని వెల్లడించారు.ఇకపోతే ప్రస్తుతం దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.