అమెరికాలోని డెస్ మోయిన్స్కు చెందిన భారతీయ కుటుంభం హత్యకి గురయ్యింది.అత్యంత దారుణంగా ఒకే కుటుంభంలో సభ్యులు అందరూ హత్యకి గురవ్వడం కలకలం రేపింది.వారు ఎందుకు హత్య చేయబడ్డారు, పోలీసులు ఈ హత్య ఘటనకి గూర్చి ఏమంటున్నారు అనే వివరాలలోకి వెళ్తే
అమెరికాలో ఎన్నో ఏళ్ల క్రితమే స్థిరపడిన వ్యక్తి సుంకర చంద్రశేఖర్.చంద్రశేఖర్(44) ఆయన భార్య లావణ్య (41) 10 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు దారుణంగా హత్య కాబడ్డారు.అయితే అదే ఇంట్లో వీరితో పాటు వీరి కుటుంభ సభ్యులు కూడా ఉన్న సమయంలోనే ఈ దారుణం జరిగిందని, ఈ ఘటన జరిగిన సమయంలో వారి ఇంట్లో ఉన్న వేరే వ్యక్తులు 911 కి సమాచారం అందించారని, ఒక వ్యక్తి రోడ్డుపైకి వెళ్లి సహాయం కోసం అభ్యర్ధించారని పోలీసులు తెలిపారు.
ఇదిలాఉంటే ఈ ఘటనతో చంద్రశేఖర్ సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.స్నేహితులు , ఈ దారుణంపై విచారం వ్యక్తం చేశారు.అయితే చంద్రశేఖర్ ఏదన్నా ఇబ్బందుల కారణంగా కుటుంభ సభ్యులని చంపి తాను చనిపోయాడా, లేక వేరే వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారా అనే కోణంలో విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.