ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు మనుషుల మధ్య అంతరాలు తగ్గించి ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తుంది.నాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు.
తక్కువ, ఎక్కువ అనే తేడా మీకు ఉంటుంది కాని నాకు కాదు అంటూ సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకు, పేదవాడి నుంచి కోటీశ్వరుడు వరకు, ఓటరు నుంచి లీడర్ వరకు అందరిని తాకుతుంది.ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు కరోనాకి గురైయ్యారు.
అలాగే స్పోర్ట్స్ స్టార్స్ కి కూడా కరోనా సోకింది.అలాగే పలు దేశాలలో రాజకీయ ప్రముఖులని కూడా కరోనా కాటేసింది.
ఇప్పుడు ఓ దేశానికి అధ్యక్షుడుగా చేసిన వ్యక్తిని కరోనా కబళించింది.
ప్రపంచ వ్యాప్తంగా పదమూడు వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఈ సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది.ఈ కరోనా ఎక్కువగా వృద్ధుల మీదనే ప్రభావం చూపిస్తుంది.
మాడ్రిడ్ దేశ మాజీ అధ్యక్షుడు లోరెంజో సాన్జ్ కొవిడ్-19 బారిన పడి మరణించారని అతని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.మాడ్రిడ్ దేశ మాజీ అధ్యక్షుడు లోరెంజో సాన్జ్ వయసు 76 ఏళ్లు.
మాజీ దేశాధ్యక్షుడే కరోనా వైరస్ తో మరణించడంతో ఆ దేశంలో ప్రజలు ఇప్పుడు మరింత ఆందోళన చెందుతున్నారు.