ప్రస్తుత పరిస్దితుల్లో మరణాలు చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించే ఉంటారు.అదీగాక కాస్త వయస్సు మళ్లీ అనారోగ్యం తో బాధపడే వారైతే పుటుక్కున ఎగిరిపోతున్నారు.
ఇప్పటికే కరోనా తన పని తాను కానిస్తుండగా, ఇతర అనారోగ్య కారణాల వల్ల రాజకీయ నేతల మరణాలు ఎక్కువైయ్యాయి.ఇదిలా ఉండగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామాయంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్ రాజయ్యగారి ముత్యంరెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు.
కాగా రామయంపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి 1978 లో ఎన్నికయ్యారు.కానీ ముఖ్యమంత్రిగా ఉన్న టి.అంజయ్య కోసం 1980 లో తన ఎమ్మెల్యే పదవికి ముత్యం రెడ్డి రాజీనామా చేశారు.ఆ తర్వాతి కాలంలో ఎమ్మెల్సీగా, జెడ్పీ చైర్మ్ గా ముత్యం రెడ్డి ప్రజలకు సేవలందించారు.
ఇలా అకస్మికంగా మృతి చెందిన ముత్యం రెడ్డి మరణంపై కాంగ్రెస్ తో సహా పలు పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు.ఇకపోతే రాజయ్యగారి ముత్యంరెడ్డి స్వస్థలం చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామం.