కోవిడ్‌తో మరణించిన ఆ రాష్ట్ర మాజీ సీఎం.. !

కరోనా కాటువేయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు.ఈ వైరస్ వల్ల వయస్సులో ఉన్న వారే కన్ను మూస్తుండగా, వయస్సు మళ్లిన వారి గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు.

 Former Rajasthan Cm Dies With Covid, Rajasthan, Former Cm, Congress‌ Leader, D-TeluguStop.com

ఇక ఈ వైరస్ సెకండ్ వేవ్ లో అయితే రాజకీయ నేతల్లో ఉన్న వయస్సు మళ్లిన వారు అందరు దాదాపుగా కరోనా కాటుకు మరణించడం గమనించే ఉంటారు.

ఈ క్రమంలోనే మరో నేతను పొట్టన పెట్టుకుంది ఈ కరోనా.

అతనే ప్రముఖ కాంగ్రెస్‌ నేత, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ పహాడియా (89).ఇక 1980-81 మధ్య రాజస్థాన్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్నాథ్‌ పహాడియా ఆ తర్వాత హర్యానా, బీహార్‌కు గవర్నర్‌గా కూడా తన సేవలు అందించారు.

కాగా జగన్నాథ్‌ పహాడియా మృతి పై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేయగా, మిగతా నేతలు తమ సంతాపాన్ని తెలియచేశారు.అంతేకాకుండా రాజస్థాన్‌ ప్రభుత్వం ఈ రోజు సంతాప దినంగా ప్రకటించింది.

ఇక పహాడియా అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube