కరోనా కాటువేయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు.ఈ వైరస్ వల్ల వయస్సులో ఉన్న వారే కన్ను మూస్తుండగా, వయస్సు మళ్లిన వారి గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు.
ఇక ఈ వైరస్ సెకండ్ వేవ్ లో అయితే రాజకీయ నేతల్లో ఉన్న వయస్సు మళ్లిన వారు అందరు దాదాపుగా కరోనా కాటుకు మరణించడం గమనించే ఉంటారు.
ఈ క్రమంలోనే మరో నేతను పొట్టన పెట్టుకుంది ఈ కరోనా.
అతనే ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89).ఇక 1980-81 మధ్య రాజస్థాన్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్నాథ్ పహాడియా ఆ తర్వాత హర్యానా, బీహార్కు గవర్నర్గా కూడా తన సేవలు అందించారు.
కాగా జగన్నాథ్ పహాడియా మృతి పై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేయగా, మిగతా నేతలు తమ సంతాపాన్ని తెలియచేశారు.అంతేకాకుండా రాజస్థాన్ ప్రభుత్వం ఈ రోజు సంతాప దినంగా ప్రకటించింది.
ఇక పహాడియా అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయని సమాచారం.