దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటంతో శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండటంతో మంగళవారం కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు.ఇదిలా ఉంటే పరిస్థితి మరింత ముదురుతోంది ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఎయిమ్స్ లో.
ఆయన్ని తాజాగా జాయిన్ చేయడం జరిగింది.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో.
మన్మోహన్ సింగ్ కరోనా వైరస్ బారిన పడ్డారు.దీంతో అప్పట్లో ఆయనను ఏయిమ్స్ లో జాయిన్ చేయడం జరిగింది.
స్వల్పంగా జ్వరం రావడంతో వెంటనే కరోనా పరీక్షలను వైద్యులు చేయడంతో కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.అంతకుముందే 2009వ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ కి ఏయిమ్స్ లోనే బైపాస్ సర్జరీ.
ఆపరేషన్ చేయడం జరిగింది.దీంతో కొన్నాళ్ల నుండి మన్మోహన్ సింగ్ ఆరోగ్యం అటు ఇటు గా ఉంది.
ఇటువంటి తరుణంలో మంగళవారం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు అప్రమత్తం అయ్యి వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్న ఆయనకు డాక్టర్ రణదీప్ గులేరియా వైద్య బృందం చికిత్స అందిస్తుంది.
ప్రస్తుతం మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.