మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.అత్యంత సౌమ్యుడిగా పేరున్న రోశయ్య మృతి బాధాకరం అన్నారు.
ఎవరు సీఎం గా వున్నా, వారికి అండగా ఉండి రోశయ్య సహకారాన్ని అందించారని తెలిపారు.ఆయన ముఖ్యమంత్రి గా వున్నప్పుడు వారి మంత్రివర్గంలో పనిచేసే అవకాశం తనకు లభించిందన్నారు.
రాజకీయాల్లో రోశయ్య గారి ముద్ర ఎప్పటికీ నిలిచివుంటుందని తెలిపారు.రోశయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.