తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతున్న పరిస్థితులలో బీజేపీ క్షేత్ర స్థాయిలో బలపడాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో బలపడడానికి ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ వినియోగించుకుంటోoది.ఈ సందర్బంగా ఆయా నియోజకవర్గాలలోని బలమైన ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి స్వాగతం పలుకుతోంది.
ఇటువంటి చేరికలతో ఇది వరకే పార్టీలో ఉన్న నేతలకు, కొత్తగా చేరే నాయకులకు మధ్య వైరం ఏర్పడుతుంది.
ఇలా పెద్దపల్లి నియోజకవర్గంలో ఇలాగే కుమ్ములాటలు మొదలయ్యాయి.
పెద్దపల్లి జిల్లాలో వై.యస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసి, టీఆర్ఎస్ లో ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచి, తరువాత కేసీఆర్ మీద వైరంతో టీఆర్ఎస్ నుండి బయటకి వచ్చి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి ఆగం చంద్ర శేఖర్ రెడ్డి, ఇటీవల బీజేపీలో చేరారు.ప్రస్తుతం బీజేపీ క్రియాశీలకంగా ఉన్న పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, అదే పెద్దపల్లి నియోజకవర్గం కు చెందిన ఆగం చంద్ర శేఖర్ రెడ్డి చేరికతో అలక పూనారు.
ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి చేరిక కార్యక్రమానికి వివేక్ గైర్హాజరు కావడంతో ఈ వాదనకు బలం చేకూరింది.ఏది ఏమైనా మాజీ ఎంపీ వివేక్ కు ఇది ఒక పెద్ద దెబ్బగానే భావించవచ్చు.