ప్రస్తుత రాజకీయాలు ఒకప్పటి రాజకీయాల కంటే ఎంతో కొంత కలుషితమయ్యాయనే చెప్పవచ్చు.కుల, మత ప్రాంతాల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నాయి.
ప్రజలు గెలిపించిన పార్టీని వదిలి స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ప్రజల నిర్ణయానికి తూట్లు పొడుస్తూ ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు.ఇదంతే నాణేనికి ఒక వైపు మాత్రమే.
ఇంకొక వైపు రాజకీయాలతో సంబంధం లేకుండా అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఉత్తర్ణులై ఐఏఎస్ లుగా ఉద్యోగాలు పొందిన వారు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజలలోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తుంటారు.చాలా నిజాయితీగా తమ పరిధికి లోబడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను పొందే గొప్ప అధికారులు ఐఏఎస్ అధికారులు.
కొంత మంది ఐఏఎస్ అధికారుల మీద అభిమానంతో ప్రజలు తమ తండాలకు కలెక్టర్ల పేర్లు పెట్టుకున్న ఘటనలు ఉన్నాయి.ఇలా క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలపై అవగాహన కలిగి ఉండి, తరువాత రిటైర్డ్ అయిన తరువాత ప్రభుత్వాలు అత్యంత ప్రతిభ కలిగిన ఐఏఎస్ లను ప్రభుత్వాలు తమకు సలహాదారులుగా నియమించుకుంటాయి.
కాని ఇటీవల బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ వివేక్ రిటైర్డ్ ఐఏఎస్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.రిటైర్డ్ ఐఏఎస్ లు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించడం జరిగినది.
బీజేపీ కేంద్రప్రభుత్వంలో అజిత్ ధోవల్ లాంటి సీనియర్ ఐఏఎస్ లాంటి గొప్ప ఐఏఎస్ లను ప్రభుత్వం గొప్ప గొప్ప పదవులను ఇచ్చి వారి సేవల్ని వినియోగించుకుంటోంది.ఏది ఏమైనా రాజకీయనాయకులు రాజకీయ లబ్ధికోసం అత్యంత పవిత్రమైన ఐఏఎస్ వ్యవస్థల మీద విమర్శలు చేస్తే, అది రాజ్యాంగ పరిరక్షణకే విఘాతం కలిగే అవకాశం ఉంది.