మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సెటైర్లు వేశారు.ఆయన గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ ఎటకారంగా అభివర్ణించారు.
ఇటీవల ధరణి పోర్టల్.భూ సమస్యల పరిష్కారం డిమాండ్ కి సంబంధించి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం అన్నిటిలో ముందు ఉంటది.వరి పండించడం లో.కానీ ఇప్పుడు వరి వేస్తే ఊరి అంటున్నావు ఏంటి సీఎం కేసీఆర్ అని ఆయన ప్రశ్నించారు.తాను కూడా ఒకానొక సమయంలో సాఫ్ట్వేర్ డెవలపర్ అని.గుర్తు చేసుకున్న ఆయన ముందు సాఫ్ట్వేర్… రెడీ చేసి.సాధ్యాసాధ్యాలపై పరీక్షలు చేయాలి.
ఈ క్రమంలో ఇటువంటి విషయాల్లో సీఎం కేసీఆర్ తో అధికారులు మాట్లాడాలంటే భయపడుతున్నారు.అసలు ధరణి అనేది ఒక సాఫ్ట్వేర్ కానే కాదు.ఇది ఒక కుట్ర అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లిన ధరణి సమస్యలు ఉన్నాయని భూములు ఇచ్చి మరి గుంజుకొన్నారని సంచలన ఆరోపణలు చేశారు.
అందరి మాదిరిగానే తనకి కూడా ధరణి సమస్య ఉందన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోర్టల్ లో.ఉంటే సర్వర్ డౌన్ అని అంటున్నారన ఆ సమయంలో వాళ్ళ పని ఈజీగా అవుతుందని, మిగతా వాళ్ళకి మాత్రం కావడం లేదని ధరణి పోర్టల్ పనితనం పై భూ సమస్యల పరిష్కారం రౌండ్టేబుల్ సమావేశంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.