టిడిపి పార్టీ నేత మాజీ మంత్రి జవహర్ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.విద్యాశాఖ మంత్రిగా చదువుకున్న వ్యక్తి ఉండటంతో… విద్యారంగం బాగుపడుతుంది అనుకుంటే మొత్తం బ్రష్టు పట్టించారు అని విమర్శించారు.
నాడు నేడు అనే కార్యక్రమం ఒక భోగం కార్యక్రమం అని ధ్వజమెత్తారు.ఇదిలా ఉంటే ఆ నాడు విద్యాశాఖలో.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
కానీ ప్రస్తుతం విద్యాశాఖ పిచ్చోడి చేతిలో రాయిలా మారింది అంటూ సీఎం జగన్ పై మాజీ మంత్రి జవహర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
అంతమాత్రమే కాకుండా ఉపాధ్యాయుల ఉసురు తీస్తుంది అంటూ వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ ఆరోపణలు చేశారు.
నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా వైసిపి నాయకులు తమ అనుచరులు కి బినామీలకు మేలు చేసే రీతిలో కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నారని.డబ్బులు ఏవిధంగా వారికి కట్టబెట్టాలి ఏవిధంగా సంపాదించాలి అన్న రీతిలో ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అంటూ.టిడిపి నేత మాజీ మంత్రి జవహర్ వైసీపీ ప్రభుత్వం పై తాజాగా సీరియస్ వ్యాఖ్యలు చేశారు.