నిన్న ప్రత్యేక విమానంలో ఉదయం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ చేరుకుని బీజేపీ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
బిజెపి కి చెందిన కొంతమంది పెద్ద నాయకుల ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు.ఈటల రాజేందర్ తో పాటు మరికొంతమంది ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.
అయితే ఈ రోజు ఉదయం మళ్లీ అదే విమానంలో తిరుగుముఖం పడుతున్న తరుణంలో విమానం గాలిలో టేకాఫ్ అవుతున్న తరుణంలో పైలెట్ విమానంలో సాంకేతిక సమస్య ఉందని గుర్తించడంతో వెంటనే అప్రమత్తమై విమానాన్ని అదుపులోకి తీసుకుని వెంటనే ప్రమాదం నుండి తప్పించారు.ఈ పరిణామంతో మాజీ మంత్రి ఈటెల కి త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లు అయింది.
ఈ ప్రత్యేక విమానంలో ఈటెల రాజేందర్ తోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు .బీజేపీ నేతలు వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమా తదితర నేతలు, కార్యకర్తలు 184 మంది ఉన్నారు.