కుప్పం నుంచి టీడీపీ గెలుపు యాత్ర మొదలవుతుంది... మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి

చిత్తూరు: కుప్పంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కామెంట్స్… ఈ ఎలక్షన్స్ లో జరిగిన విధానానికి గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలి.ఓటుకు 15వేలు ఇచ్చారు వైస్సార్ పార్టీ వాళ్ళు.

 Former Minister Amarnath Reddy Comments On Kuppam Municipal Elections, Former Mi-TeluguStop.com

మెప్మా అధికారులను వాడుకొని దొంగ ఓటర్లను తరలించారు.టీడీపీ కి అండగా కుప్పంలో ఓటర్లు ఎప్పుడు అండగా ఉంటారు.

వైస్సార్సీపీ పార్టీ ఎంత ప్రలోభాలు చేసిన టీడీపీ గెలుపు ఖాయం.కుప్పం నుంచి టీడీపీ గెలుపు యాత్ర మొదలవుతుంది.

నిమ్మల రామానాయుడు కామెంట్స్… కుప్పంలో పోలీసులు వైస్సార్సీపీ కార్యకర్తలు లాగా పని చేసారు.నామినేషన్ వేసినప్పుడు నుంచి ఇప్పటి వరకు టీడీపీ వాళ్ళను వేదించారు.సజ్జలకు సిగ్గుండాలి, మా కష్టంతో జీతం తీసుకొంటావు.కుప్పం ప్రశాంతతకు మారు పేరు, ఇక్కడ వైస్సార్సీపీ గెలిస్టే కుప్పంలో రౌడీయిజం చేస్తుంది , అందుకే ప్రజలు టీడీపీ గెలిపిస్తారు.

దొంగ ఓట్లను ఎయిర్ మార్గం మరియు సముద్ర మార్గం తప్పా అన్ని రవాణా మార్గాలు ఉపయోగించుకున్నారు.

వైస్సార్సీపీ వ్యవస్థలను స్వయంగా వాడుకొంటు పులివెందుల రాజకీయం చేస్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొక్కబెట్టారు.

దొంగ ఓట్లు వేయడం వైస్సార్సీపీ పేటెంట్ హక్కు.మంత్రి వర్గ విస్తరణలో దొంగ ఓట్ల మంత్రి శాఖ పెద్దిరెడ్డి.

మంత్రి వర్గ విస్తరణలో దొంగ ఓట్ల మంత్రి శాఖ పెద్దిరెడ్డి కి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి.జగన్మోహన్ రెడ్డి కి ఆయన పాలనపైన నమ్మకం లేదు, ఎందుకీ పోలీస్ వ్యవస్థ ను వాడుకొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube