దేశవ్యాప్తంగా కరోనా కేసులు చాపకింద నీరులా విజృంభిస్తూనే ఉంది.ఇప్పటికే రాష్ట్రాల్లో కొన్ని వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
అయితే ఇప్పటికే రాష్ట్రాల నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు కరోనా వెంటాడుతోంది.పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు.
వీరిలో కొందరూ కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా మరికొందరు మృత్యువాత పడుతున్నారు.తాజాగా కర్ణాటకకు చెందిన మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు.
కర్ణాటకలోని భద్రావతి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, జేడీఎస్ నేత అప్పాజీ గౌడ్ కరోనాతో ఈ రోజు (గురువారం) ఉదయం కన్నుమూశారు.గత కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా టెస్టులు చేయించుకున్నాడు.
ఈ మేరకు రిపోర్టలో పాజిటివ్ అని తేలింది.దీంతో ఆయన కుటుంబ సభ్యులు శివమొగ్గలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.అయితే గత మూడు రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.దీంతో డాక్టర్లు వెంటిలేటర్ పై ఉంచి ఆక్సిజన్ అందించారు.
అయినా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి డిస్ట్రిక్ మెక్ జెన్ ఆస్పత్రికి తరలించారు.ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారింది.
సమస్య తీవ్రరూపం దాల్చడంతో ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.