క్రికెట్ ఆటలో స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడి కెరీర్ని నాశనం చేసుకున్న “శ్రీశాంత్” ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మాత్రం అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తున్నాడు.కాగా ఆ మధ్య “శ్రీశాంత్” ప్రధాన పాత్రలో నటించిన అక్సర్ 2, టీమ్ 5, కెంపెగౌడ 2, తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద బాగానే ప్రేక్షకులను అలరించాయి.
కాగా “కెంపె గౌడ 2” చిత్రంలో విలన్ పాత్ర పోషించిన శ్రీశాంత్ కి సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వరించింది.దీంతో శ్రీశాంత్ కి ఇటీవలే తన నిషేదం పూర్తయినప్పటికీ మళ్లీ తన కెరీర్ ని మొదలు పెట్టేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.
దీనికితోడు సినిమా రంగం శ్రీశాంత్ కి బాగా కలిసి రావడంతో ఇందులోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.కాగా ప్రస్తుతం శ్రీశాంత్ తమిళ భాషలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఈ చిత్రంలో శ్రీశాంత్ పవర్ఫుల్ సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట.కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా మాజీ శృంగార తార మరియు స్పెషల్ సాంగ్ హీరోయిన్ “సన్నీ లియోన్” నటిస్తున్నట్లు సమాచారం.
తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు.అయితే సన్నీ లియోన్ కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో పలు స్పెషల్ సాంగ్స్ చిత్రాలలో నటిస్తూ ఉండడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.
అంతేగాక ఇటీవలే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను కూడా మొదలు పెట్టింది.
అయితే క్రికెట్ ఆటలో స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడిన తర్వాత శ్రీశాంత్ లైఫ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.గతంలో ఓ ప్రముఖ ఇంగ్లీషు ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో తాను నిషేధం ఎదుర్కొన్న తర్వాత అనుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయానికి తన జీవితాన్ని పోగొట్టుకున్నానని తన లైఫ్ లో మరోమారు అలాంటి నిర్ణయం తీసుకోనని తెలిపాడు.