భారత్ మాజీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని పేరు తెలియని వారెవరు ఉండరు.ఇండియా టీం కెప్టెన్ గా ధోని బాధ్యతలు చేపట్టాక… అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ బలమైన జట్టుగా తీర్చిదిద్దబడింది.ఈ క్రమంలో ధోని నాయకత్వంలో 2007లో తొలి టీ20 కప్ గెలవగా.2011వ సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ గెలవడం జరిగింది.ధోని వికెట్ కీపర్ గా కెప్టెన్ గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాడు.అన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ ఉన్నాడు.ఒకపక్క ఆడుతూనే మరోపక్క యాడ్స్ కూడా ధోని చేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఓ యాడ్ షూట్ లో ధోని పోలీస్ అవతారం ఎత్తాడు.ఈ యాడ్ కీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఫోటోలో చుట్టూ కానిస్టేబుల్స్ ఉండగా మధ్యలో లాఠీ పట్టుకుని ధోని నిలబడిన స్టీల్.వైరల్ అవుతూ ఉంది.2023 ఐపీఎల్ సీజన్ కి ఆల్ రెడీ ఇప్పటికే ధోని ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది.ఇదే సమయంలో నిర్మాతగా కూడా తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు.కాగా ఇప్పుడు ఓ యాడ్ షూటింగ్ లో ధోని పాల్గొనడం విశేషం.