మానసిక సంఘర్షణ ఎంతటి వారినైన కుంగుబాటుకు గురిచేస్తుంది.ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఊహించని విధంగా ఉంటాయి.
ఇక ఇలాంటి క్లిష్ట పరిస్దితులను ఎదుర్కోలేక ఎందరో ఉన్నత విధ్యావంతుల దగ్గరి నుండి, సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు కామన్ పీపుల్స్ అందరు కూడా ఎంచుకునే మార్గం ఆత్మహత్య.
బలవంతంగా ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్లిపోవడం.
ఇలా వారు బలవణ్మరణం పొందినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదు కదా.అందుకే చావడానికి చేసే ధైర్యంలో కొంత బ్రతకడానికి ఉపయోగిస్తే బాగుంటుంది.
ఇకపోతే ప్రస్తుతం ఆత్మహత్యకు పాల్పడ్డాడట ఓ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ.ఆ వివరాలు చూస్తే.దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ముంబైలోని ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్నారు.కాగా శవపరీక్ష కోసం ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారట.
ఇకపోతే దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్ 2019లో ఆ పార్టీకి రాజీనామా చేసి, ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారట.ఇక ఈయన ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది తెలియరాలేదు.