నందమూరి బాలకృష్ణ కేవలం హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఆహా వేదికగా ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇకపోతే ఈ కార్యక్రమం ఇప్పటికే మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ కార్యక్రమాల ద్వారా ఆహా సబ్స్క్రైబర్లు కూడా పెరగడంతో నిర్వాహకులు సీజన్ 2 కార్యక్రమాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.మొదటి సీజన్లో కేవలం సినిమా సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించి బాలకృష్ణ తన స్టైల్ లో వారిని ప్రశ్నించే వారి నుంచి సమాధానాలు రాబట్టారు.
అయితే ఈసారి రాజకీయ నాయకులను కూడా ఈ కార్యక్రమానికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బాలకృష్ణ బావగారు నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా రాబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక ఫోటో వైరల్ కావడంతో చంద్రబాబు నాయుడు మొదటి అతిథిగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారని తెలుస్తుంది.
ఇలా వీరిద్దరూ ఒకే వేదికపై రాజకీయాల గురించి ఏం మాట్లాడనున్నారు.బాలకృష్ణ తన బావకు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేయబోతున్నారనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.