అమరావతి: రాజధాని రైతులకు సంఘీభావం తెలిపిన సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ. తుళ్లూరు రైతుల శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపిన లక్ష్మినారాయణ.
రైతుల మహా పాదయాత్ర కి సంఘీభావం తెలిపిన లక్ష్మీ నారాయణ.జేడీ లక్ష్మీనారాయణ, సీబీఐ మాజీ డైరెక్టర్.681 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారు.రైతులు భూములు ఇచ్చింది వారి స్వప్రయోజనాల కోసం కాదు…రాష్ట్ర ప్రయోజనాల కోసం.
మహిళలు రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేస్తుంటే మనసు కలిచివేస్తుంది.మాతృమూర్తులను పోలీసులు కొట్టడం చూసి భాధ ఆవేదన కలిగింది.వెంటనే ప్రభుత్వం స్పందించి రాజధానిని ఇక్కడే నిర్మించాలి.ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా రాజధానిపై ఒక విధానంతో ముందుకు వెళ్ళాలి.
రాజధాని 29 గ్రామాల సమస్య కాదు…అమరావతి అనేది రాష్ట్ర సమస్య.గత ప్రభుత్వం కొంత ఖర్చు చేసి ఎంతో కొంత నిర్మాణ పనులు చేశారు.
గత ప్రభుత్వం 10 వెల కోట్లు ఖర్చు చేసి ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేసింది.కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రైతుల త్యాగం మరిచింది.రైతులు వారి స్వార్ధం కోసం భూములు ఇవ్వలేదు.రైతులపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.