గత వారం రోజులుగా సున్నిపెంట లోని వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి ఇళ్ళ మధ్యలోకి వచ్చి సంచరిస్తున్న ఎలుగుబంటి.ఎలుగుబంట్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.
అటవీశాఖ అధికారులు పధకం ప్రకారం ఎక్కువ సార్లు సంచరించిన ప్రాంతంలో ,అడవి లో నుంచి బయటకు వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడక్కడ బోన్ లు ఏర్పాటు చేశారు.
అదృష్టశాత్తు రాత్రి బయటకు వచ్చిన ఎలుగుబంటి ఒక దానిని అటవీశాఖ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి ప్రమాదమా జరగకుండా ఎలుగుబంటి ని బంధించారు.
అనంతరం ఎలుగుబంటి ని ప్రత్యేక వాహనంలో వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు.దీనితో స్థానికులకు ఎలుగుబండి భయం వీడింది.దొరికింది ఒక్కటే ఇంకా దొరకనివి రెండు ఉన్నాయి అని స్థానికులు చర్చించుకుంటున్నారు.