ఫ్లిప్ కార్ట్ సంస్థ తన వైబ్ సైట్లో యాపిల్ డేస్ సేల్స్ ని నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఫ్లిప్ కార్డుతమ వినియోగదారులకు ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్లతో పాటు భారతదేశంలోని అన్ని ఫోన్లపై భారీ తగ్గింపుతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే ఈ సేల్ ఆఫర్ ఆగస్టు 25వరకు అందుబాటులో ఉంటున్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపారు.అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో ఐఫోన్ ఎస్ఈ 2020 ని యాపిల్ విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ ఫోన్ను చాలా తగ్గింపు ధరకే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.
ఇక ఐఫోన్ ఎస్ఈ 64 జీబీ వేరియంట్ రూ.35,999కు అందుబాటులోకి తీసుకొచ్చింది.అయితే ఈ ఫోన్ లంచ్ అయినప్పటి నుండి చాలా తక్కువ ధరకు తీసుకరావడం ఇదే మొదటిసారి.అయితే ఈ ఫోన్ లో 128 జీబీ వేరియంట్ రూ.40,999కు కొనుగోలు చేస్తున్నారు.అంతేకాకుండా 256 జీబీ వేరియంట్ రూ.50,999 ధరకు అందుబాటులోకి తీసుకొచ్చారు.అంతేకాకుండా ఈ ఫోన్ ఎక్స్ చేంజ్ పై రూ.13,450 వరకు ధరను తగ్గింపను ఫ్లిప్ కార్డు సంస్థ అందించడానికి సిద్ధం అయ్యింది.వీటితో పాటు నెలకు ఒక్కసారి రూ.5,667 చెల్లించే విధంగా నో కాస్ట్ ఈఎంఐను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
అంతేకాకుండా ఐఫోన్ ఎక్స్ఆర్ 64 జీబీ వేరియంట్ ఫోన్ ని ప్రస్తుతం రూ.45,999 కే కొనుగోలు చేస్తున్నారు.అలాగే 128 జీబీ వేరియంట్ రూ.51,999కే కొనుగోలు చేయవచ్చుని సంస్థ యాజమాన్యం తెలిపారు.అంతేకాకుండా రెడ్, బ్లాక్, బ్లూ, కోరల్, వైట్, పసుపు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.ఈ ఫోన్ పై నెలకు రూ.5,111 నుండి నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.అయితే సేల్ లో భాగంగా ఐఫోన్ 11కు చెందిన 64 జీబీ మోడల్ ను రూ.63,300 కి కొనవచ్చునని తెలిపారు.