పిడుగు పడి ఫుట్ బాల్ ప్లేయర్ మృతి..!

స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆటగాళ్లపై పిడుగుపడింది.వీరిలో ఓ ప్లేయర్ ప్రాణాలు విడిచాడు.

 Football, Player, Killed, Lightning Strike,-TeluguStop.com

స్టేడియం నిర్వహకులు వర్షం పడుతున్నా.మ్యాచ్ కొనసాగించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

పిడుగు పడి ఓ ప్లేయర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన జార్ఖండ్ రాజధానీ రాంచీలో చోటు చేసుకుంది.

మావోయిస్ట్ ప్రభావిత గ్రామంగా ముద్రపడిన ఉరుబార్డిలో చిన్న ఫుట్ బాల్ స్టేడియం ఉంది.నెమాన్ కుజుర్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ లో భాగంగా నిర్వహకులు మ్యాచ్ నిర్వహించారు.

కాగా, మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం పడింది.అయినా నిర్వహకులు మ్యాచ్ ని కొనసాగించారు.

కొద్ది సేపు తర్వాత భారీ శబ్దంతో స్టేడియంలో పిడుగు పడింది.దీంతో పరాస్ పన్నా అనే ఆటగాడితో పాటు మరో నలుగురిపై పిడుగు పడింది.

దీంతో మ్యాచ్ చూస్తున్న అభిమానులు భయాందోళనకు గురయ్యారు.ఆటగాడి మరణంతో స్టేడియంలో విషాద చాయలు అలుముకున్నాయి.

నిర్వహకులు వెంటనే మిగిలిన వారిని సమీపంలోని గుమ్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు సమాచారం అందుకున్న చైన్ పూర్ సబ్ డివిజన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఫుట్ బాల్ మ్యాచ్ ని ఏలా నిర్వహించారని నిర్వహకులను నిలదీశారు.ఫుట్ బాల్ నిర్వహకులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి కుల్దీప్ కుమార్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube