మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల పాదయాత్ర కూడా స్టార్ట్ చేసి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేస్తూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అదే రీతిలో కేసిఆర్ మరికొంతమంది కీలక నాయకులపై కూడా పాదయాత్రలో ఈటెల రాజేందర్ విమర్శలు చేస్తూ.భారీగా వ్యూహాలు వేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా ఈటె అనుచరులు.బిజెపి పార్టీకి చెందిన నాయకులు హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన వారు తాజాగా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి ఈటల కు సరికొత్త షాక్ ఇచ్చారు.
మేటర్ లోకి వెళ్తే ఇల్లందుకుంట కి చెందిన.ఎంపీపీ పావని అదేరీతిలో ముగ్గురు సర్పంచ్ లు బిజెపి పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీలు జంపింగ్ జపాంగ్ లు కామన్.ఇలాంటి తరుణంలో బిజెపి పార్టీకి చెందిన వారు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం.తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.