అమెరికా పోలీసులు ఓ కేసుకు సంభందించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.ఎప్పుడూ సీరియస్ గా, తమపని తాము చేసుకునే పోలీసులు చేసిన పోస్ట్ చూసి నెటిజన్లు షాక్ కు గురయ్యారు.
వీళ్ళు మనపోలీసులేనా అంటూ పోలీసులు చేసిన పోస్ట్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంతకీ వాళ్ళు చేసిన పోస్ట్ ఏంటి, అంతగా పోస్ట్ వైరల్ అవ్వడానికి కారణం ఏంటి అనే వివరాలలోకి వెళ్తే… అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ట్రక్కులు సుమారు 350 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఈ గంజాయి మొత్తం విలువ దాదాపు రెండు మిలియన్ డాలర్లు ఉంటుందట అంటే మన కరెన్సీలో సుమారు రూ.15 కోట్ల పై మాటే.అయితే గంజాయి రవాణా చేసే వారిలో భయం కలిగేలా పోలీసులు సోషల్ మీడియాలో ఫన్నీ గా ఓ పోస్ట్ పెట్టారు.అది కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే
ఈ గంజాయిని ఎంతో కష్టపడి సంపాదించుకున్న వారు ఎవరో పాపం పోగొట్టుకున్నారు.ఈ సంపదను పోగొట్టుకున్న వారు ఎవరైనా సరే మా సహాయం తప్పకుండా ఉంటుంది.
దయచేసి నార్కోటిక్స్ సిబ్బందిని వెంటనే కలవండి మీరు పోగొట్టుకున్న గంజాయిని, మిమ్మల్ని దగ్గర చేసే బాద్యత మాది మేము మీకు మంచి చేయాలనే ఆలోచనతో, ఇద్దరినీ ఏకం చేయాలనే కోరికతో మేము వేచి చూస్తున్నాము దయచేసి మీ సంపదని వచ్చి ఒక్క సారి చూసుకొండి, మీరు మరొక్క సారి ఈ సంపద పోగొట్టుకోకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటాము నిజం అంటూ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ చూసిన ప్రజలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడమే కాదు గట్టిగా బుద్ది చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారట.